#s2news #jointcollector #mujammilkhan
ప్రభుత్వం పాఠశాలలో నాణ్యమైన విద్యాబోధన తో పాటు పౌష్టికాహారం అందజేయడం జరుగుతుందని సిద్దిపేట జిల్లా అదనపు కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ అన్నారు. సిద్దిపేట జిల్లా దుబ్బాక మండల కేంద్రంలోని మైనారిటీ రెసిడెన్షియల్ పాఠశాలలో ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. పాఠశాలలో మధ్యాహ్న భోజనాన్ని తనిఖీ చేసి భోజనం ఎలా ఉందని విద్యార్థులను నేరుగా అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులకు ప్రభుత్వం సూచించిన మెనూ ప్రకారం పౌష్టికాహారం అందించాలని నిర్వాహకులకు సూచించారు. అనంతరం విద్యార్థులతో కలిసి అదనపు కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ మధ్యాహ్న భోజనం చేశారు. పాఠశాలలోని రికార్డులను ఆయన పరిశీలించి, ఉపాధ్యాయులకు పలు సూచనలు చేశారు. విద్యార్థులకు ఇబ్బందులు కలవకుండా చూడాలని సూచించారు. విద్యార్థులు పట్టుదలతో చదివి ఉన్నత లక్ష్యాలను చేరుకోవాలన్నారు. పాఠశాలలో నెలకొన్న సమస్యలను పరిష్కరించే విధంగా చూడాలని అధికారులకు ఆదేశించారు.
...
https://www.youtube.com/watch?v=esqx2EML10Y
#s2news #s2newssrinivasreddy #congress
నార్సింగి మండలం లో దుబ్బాక కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ చెరుకు శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ ని అధికారం లోకి తేవడానికి బీజేపీ మరియు తెరాస పార్టీ నుండి యువకులు కాంగ్రెస్ పార్టీ మండల్ అధ్యక్షులు గోవర్ధన్ సమక్షంలో కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ చెరుకు శ్రీనివాస్ రెడ్డి మరియు మాజీ zptc పోతు రాజు రమణ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ లో చేరడం జరిగింది. ఈ కార్యక్రమం లో కాంగ్రెస్ అధ్యక్షులు గోవర్ధన్,ఎంపీటీసీ కొండా స్వామి,డీసీసీ అధ్యక్షులు ఈరప్ప యాదగిరి మరియు ఆకుల శ్రీనివాస్ గౌడ్, ఉపసర్పంచ్ కేశవులు,కాంగ్రెస్ నాయకులు ఇంద్రసెనరెడ్డి, రవి, శంకర్ నాయక్,సుధాకర్, అరవింద్ గౌడ్, స్వామి,రవీందర్, షన్ పాషా, ఎలామ్ తదితరులు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు
...
https://www.youtube.com/watch?v=qnKIHsBm9NU