కుటుంబ పాలనతో తెలంగాణ ను లూటీ చేసి డబ్బు సంపాదించి జైలులో ఉన్న బిడ్డను విడుదల చేసుకునేందుకు కెసిఆర్ నానా ప్రయత్నాలు చేస్తుండని మంత్రి కొండా సురేఖ అన్నారు. సిద్దిపేట జిల్లా దుబ్బాక పట్టణంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో నీలం మధు తో కలిసి బుధవారం మంత్రి కొండా సురేఖ ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ దుబ్బాక లో గత ఉప ఎన్నికల్లో గెలిచిన రఘునందన్ రావు కేంద్రం నుంచి ఎన్ని నిధులు తెచ్చాడో చూపించాలని సవాల్ విసిరారు. కేంద్రం లో మీ మోడీ ప్రభుత్వం ఉన్నప్పుడే రూపాయి తేలేని రఘునందన్ రావు ఇప్పుడు వచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వం అని కాంగ్రెస్ ప్రభుత్వం లో ఎలా నిధులు తెస్తావని ఓట్లు అడుగుతున్నావని ప్రశ్నించారు. నీకంటే చెరుకు శ్రీనివాస్ రెడ్డి నయం అన్నారు. ఏ పదవి లేకున్నా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక దుబ్బాక కు రూ. 40 కోట్లు తెచ్చిండని చెప్పారు. తెలంగాణ కు బిజెపి ప్రభుత్వం ఇచ్చింది గాడిది గుడ్డే అన్నారు. ఎన్నికల ముందు చెప్పిన ఆరు గ్యారెంటీలలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక ఐదు అమలు చేసినామని గర్వంగా చెప్పుతున్నామన్నారు. కేంద్రంలో వంద శాతం బిజెపి రాదని.. వచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వమే అని ధీమా వ్యక్తం చేశారు. రాముడి పేరుతో ఓట్లు దండుకునే ప్రయత్నం మోడీ చేస్తుండని, మోడీ బ్రహ్మచారి కాబట్టి రాముడిని బాల రాముడు అని ప్రచారం చేయడం బాధాకరం అన్నారు. ఏది ఏమైనా మెదక్ నుండి కాంగ్రెస్ జెండా ఎగరడం ఖాయం, నీలం మధును ఎంపీ గా పార్లమెంటు కు పంపడం ఖాయమన్నారు. రేపు నర్సాపూర్ కు రాహుల్ గాంధీ రాబోతున్నారని.. ఆ సభ విజయవంతం చేయాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు.
...
https://www.youtube.com/watch?v=VfT42KPwIwg
#bjp #raghunandanrao #mla
*పోతారం గ్రామంలో మల్లన్న జాతర ఉత్సవాల్లో పాల్గొన్న దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు*
ఈరోజు దుబ్బాక మండలం పోతారం గ్రామంలో జరుగుతున్న మల్లన్న జాతర ఉత్సవాల్లో దుబ్బాక శాసనసభ్యులు మాధవనేని రఘునందన్ రావు పాల్గొన్నారు. స్వామివారికి ప్రత్యేక పూజల్లో పాల్గొని దర్శించుకున్నారు. దుబ్బాక నియోజకవర్గం ప్రజలు సుఖశాంతులతో ఉండాలని ఎమ్మెల్యే ఆకాంక్షించారు. ఇంత పెద్ద ఎత్తున స్వాగతం పలికిన పోతారం గ్రామ ప్రజలకు ఎమ్మెల్యే రఘునందన్ రావు ధన్యవాదాలు తెలిపారు.
ఎమ్మెల్యే మాట్లాడుతూ క్యాన్సర్ అనే భూతానికి కారణంగా మారుతున్న ప్లాస్టిక్ ని నివారించాలని ప్లాస్టిక్ వాడకం మానేయాలని గ్రామ ప్రజలను కోరారు.
...
https://www.youtube.com/watch?v=Wiad3FLnjIw