#s2news #former #flag
స్వతంత్ర భారత వజ్రోత్సవాల్లో మహిళా కూలీలు భాగస్వాములయ్యారు. ముస్తాబాద్ మండలం బదనకల్ కేంద్రంలో వరి నాట్లు వేస్తున్న మహిళ కూలీలు. ప్రభుత్వం సూచించిన సమయానికి జాతీయ గీతం మైక్ ల ద్వారా వినిపించడంతో నాట్లు వేసే మహిళలు అక్కడే నిలబడి జాతీయ జెండాలు చేతిలో పట్టుకొని జనగణమన గీతాన్ని ఆలపించారు. శ్రమను నమ్ముకుని బతుకే కూలీల చాటిన దేశభక్తిని చూసి హర్షం వ్యక్తం చేశారు.
...
https://www.youtube.com/watch?v=AZFJjYlQ3pU
#rekulakunta #mallikarjunatemple #mallanna
తమకు న్యాయం చేయాలని అధికారులు వేడుకోవడానికి పోతే వేరే వర్గం వారు తమపై దౌర్జన్యంగా దాడికి దిగడం జరుగుతుందని రేకులకుంట మల్లికార్జున స్వామి ఆలయానికి చెందిన పయ్యావుల వర్గం వారు ఆరోపించారు. సిద్దిపేట జిల్లా దుబ్బాక పురపాలికలను ఒకటో వార్డులో గల రేకులకుంట మల్లికార్జున స్వామి దేవాలయంలో మూడు వర్గాలకు చెందినవారు ఒక్కో వర్గానికి 20 మంది చొప్పున 60 మంది నియమించే విధంగా గతంలో దేవాదాయ శాఖ ఆదేశాలు ఇచ్చింది. ఈ క్రమంలో కొందరు స్వార్థంతో చెరుకూరి వర్గం 26 మందిని చేర్పించుకోవడం జరిగిందని పయ్యావుల వర్గం వారు ఆరోపించారు. పయ్యావుల వర్గంలో మాత్రం కేవలం పది మంది మాత్రమే ఉన్నారని తమ వర్గానికి కూడా 20 మందికి ఆలయంలో ఉపాధి కల్పించాలని డిమాండ్ చేశారు. ఇదే విషయాన్ని హైదరాబాద్లోనే దేవాదాయ శాఖ అధికారులకు విన్నవించడానికి వెళ్తే, అక్కడ చెరుకూరి కోటి అనే రెండు వర్గాల వారు తమపై దాడికి ప్రయత్నించి, భయభ్రాంతులకు గురి చేయడం జరిగిందని ఆరోపించారు. మంత్రి హరీష్ రావు ప్రత్యేక చొరవ తీసుకొని తమకు న్యాయం చేయాలని వేడుకున్నారు.
...
https://www.youtube.com/watch?v=znlo2mvvsgY
చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి .
శ్రీకాళహస్తిలో విద్యలోనే కాక క్రీడలలో కూడ రికార్డ్ బ్రేక్ చేయడంలో శ్రీ చైతన్య విద్యా సంస్థలకు పేట్టీంది పేరు ! దీనికి నిదర్శనమే ప్రస్తుతం శ్రీ చైతన్య విద్యా సంస్థలు సరికొత్త రికార్డు వేదికగా నిలిచింది! డిసెంబర్ 4వ తేదీన దేశం మొత్తం మీద శ్రీ చైతన్య విద్యా సంస్థలు142000 లోని మంది విద్యార్థులతో చేసినటువంటి ఈ విన్యాసాలు దేశం మొత్తం మీద 390 బ్రాంచీలు వేదికగా నిలిచాయి!
ఈ సందర్భంగా ప్రిన్సిపల్ రూపాదేవి మాట్లాడుతూ...
శ్రీ చైతన్య విద్యా సంస్థలు ఎంతో ఛాలెంజింగ్గా ఈ కార్యక్రమాలన్నీ తీసుస్తున్నాయని దేశం మొత్తం మీద ఉండే అన్ని శ్రీ చైతన్య పాఠశాలలో చదివే విద్యార్థులతో ఒకే సమయంలో ఈ ఈవెంట్ పాల్గొనడం జరిగింది అంతే కాకుండా ఏడు నిమిషాలు ఎటువంటి విరామం లేకుండా మాస్ డ్రీల్ 20 నిమిషాల పాటు ఎటువంటి విరామం లేకుండా 45 యోగ విన్యాసాలు చేసి సరికొత్త రికార్డు నెలకొల్పింది అని ఆమె అన్నారు దీంతో దేశంలోని శ్రీచైతన్య విద్యాసంస్థల పేరు చిరస్తాయిగా నిలిచిపోతుందని అని తమ విద్యాసంస్థల గోప్పతనం గురించి చెప్పారు.
బైటు .ప్రిన్సిపల్ రూపాదేవి.
...
https://www.youtube.com/watch?v=MT3KHo1f-6Q
గురుకుల పాఠశాల లో విషాదం
చెరువు గట్టుపై చెప్పులు బట్టలు లభ్యం
ఆస్టల్ విద్యార్థిగా గుర్తించిన స్థానికులు
నవతెలంగాణ మిరుదొడ్డి
గురుకుల పాఠశాల విద్యార్థి హాస్టల్ నుండి గోడదూకి పారిపోయి చెరువులో పడ్డారని ఆరోపణ. మంగళవారం మిరుదొడ్డి మండలం అల్వాల సాంఘిక సంక్షేమ బాలుర గురుకుల పాఠశాలలో చోటు చేసుకుంది . హాస్టల్లో తొమ్మిదో తరగతి చదువుతున్న అలిగే కరుణాకర్ స్నేహితులతో కలిసి సమీపంలోని కుంటలో స్నానానికి వెళ్లారు. సరదాగా స్నానాలు చేస్తున్న సమయంలో కరుణాకర్ ఒక్కసారిగా జెసిబి గుంతలో మునిగిపోవడంతో స్నేహితులు కట్టెల సాయంతో కాపాడే ప్రయత్నం చేసిన ఫలితం లేకుండా పోయింది. కరుణాకర్ స్వగ్రామం నారాయణఖేడ్ మండలం గాడిదల హర్కేల్ తెలిపారు. విషయం బయటకు రావడంతో ఉపాధ్యాయులు పోలీసులకు సమాచారం అందించారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు గుంతలో పడిన కరుణాకర్ కోసం గాలింపు చర్యలు చేపట్టారు. కుంట సమీపంలో కర్ణాకర్ బట్టలు చెప్పులను పోలీసులు గుర్తించారు. రాత్రి సమయం కావడంతో కుంటలో కరుణాకర్ కోసం గాలింపు చేపట్టిన ఫలితం లేకుండా పోయింది.
...
https://www.youtube.com/watch?v=x5qNWOlZn0w
#s2news #congress #cheruku
రోడ్డు ప్రమాదంలో తల్లిదండ్రులను కోల్పోయి అనాధలుగా మారిన చిన్నారులను కాంగ్రెస్ పార్టీ దుబ్బాక నియోజకవర్గ ఇన్చార్జి చెరుకు శ్రీనివాస్ రెడ్డి పరామర్శించారు. మిరుదొడ్డి మండలం కాసులాబాద్ గ్రామానికి చెందిన తిరుమలేష్, బాలమణి దంపతులు రోడ్డు ప్రమాదంలో మృతి చెందడం బాధాకరమన్నారు. భార్య భర్తలు ఇద్దరు మృతి చెందడంతో ఇద్దరు పిల్లలు అనాధలుగా మారడం పట్ల ఆవేదన వ్యక్తం చేశారు. అనంతరం బాధ్యత కుటుంబ సభ్యులను ఆయన పరామర్శించారు. రోడ్డు ప్రమాదంలో దంపతులు మరణించడం కలిచి వేసిందన్నారు. బాధిత కుటుంబాన్ని ప్రభుత్వ పరంగా ఆదుకోవాలని కోరారు. అనంతరం మృతుల కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు. అధైర్యపడవద్దని తామంతా అండగా ఉంటామని చిన్నారులను ఓదార్చారు. అనంతరం బాధిత కుటుంబానికి ఆర్థిక సాయం అందజేశారు. ఆయన వెంట కాంగ్రెస్ నాయకులు పలువురు పాల్గొన్నారు.
...
https://www.youtube.com/watch?v=84uVNTcU6Qc