సిద్దిపేట జిల్లా దుబ్బాక మున్సిపాలిటీ పరిధిలోని చెల్లాపూర్ 3 వ వార్డులో మొన్న పిడుగుపాటుతో మరణించిన రైతు కుటుంబానికి పదివేల ఆర్థిక సహాయం చేసిన టిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు చెరుకు శ్రీనివాస్ రెడ్డి.
...
https://www.youtube.com/watch?v=4t-U_EkTh2I
#car #tractor #fire
గుర్తు తెలియని దుండగులు అర్ధరాత్రి కారుకు నిప్పంటించిన ఘటన మిరుదొడ్డి మండలంలో చోటుచేసుకుంది. సిద్దిపేట జిల్లా మిరుదొడ్డి మండలం అక్బర్ పేట గ్రామ సర్పంచ్ స్వరూప బుచ్చయ్య కారు తోపాటు ట్రాక్టర్ కు రాత్రి దుండగులు దగ్ధం చేశారు. రోజు మాదిరిగానే ఇంటి పక్కన పార్కు చేసిన కారు, ట్రాక్టర్ పై దుండగులు పెట్రోల్ పోసి నిప్పంటించడంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. రాత్రి సమయంలో టైర్ పగిలి పెద్ద శబ్దం రావడంతో స్థానికులు గమనించారు. కారు నుండి పెద్ద ఎత్తున మంటలు చెలరేగడంతో గమనించిన స్థానికులు, కుటుంబ సభ్యులు వెంటనే మంటలు ఆర్పే ప్రయత్నం చేశారు. అయినప్పటికీ ఫలితం లేకుండా పోయిందని వాపోయారు. కావాలని చెప్పే ఎవరు కారుకు నిప్పట్టించారని సర్పంచ్ స్వరూప బుచ్చయ్య తెలిపారు. కారుకు నిప్పంటించడంతో గ్రామంలో భయాందోళన పరిస్థితి నెలకొంది. వెంటనే దుండగులను పట్టుకొని పోలీసులు శిక్షించాలని గ్రామస్తులు కోరుతున్నారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
...
https://www.youtube.com/watch?v=x8A8K9y12J8