#trs #medakmp #kpr
సిఎం కెసిఆర్ ను దేశ రాజకీయాలకు పంపేందుకు సిద్దిపేట నుండే తిలకం దిద్దుతామని ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి అన్నారు. కేంద్ర ప్రభుత్వం అవలంభిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను అరికట్టేందుకు కెసిఆర్ జాతీయ రాజకీయాలకు పోవల్సిందే అన్నారు. సిద్దిపేట జిల్లా దుబ్బాక పట్టణంలో ఆదివారం మీడియా సమావేశంలో ఎంపీ మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం రైతులను అనేక రకాల మోసం చేస్తుంది అని ఆరోపించారు. రైతులు పండించిన ధాన్యం కొనకపోగ.. విదేశాలకు అమ్మకుండా 20% జీఎస్టీ పెట్టిందని విమర్శించారు. విదేశాల్లో వరి ధాన్యం కు డిమాండ్ పెరిగిందని.. అమ్ముదామంటే కేంద్ర ప్రభుత్వం అడ్డుపడుతుందని ఆరోపించారు. తము పండించిన పంటను అమ్ముకోలేని దౌర్బాగ్యస్థితిని కేంద్ర బిజెపి ప్రభుత్వం అవలంబిస్తుందన్నారు. వరి ధాన్యం పండించద్దని ఒకసారి, వరి ధాన్యం కొనమని ఒకసారి, కొంటామని ఒకసారి ఇలా రైతులు బాగుపడకుంటా కేంద్ర ప్రభుత్వం కపట నాటకం ప్రదర్శిస్తుందన్నారు. దీనిపై రాష్ట్ర బిజెపి నాయకులు ఎందుకు నోరెత్తడం లేదని ప్రశ్నించారు.
కేంద్రం లో బిజెపి అవలంభిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలను అరికట్టేందుకే కెసిఆర్ జాతీయ రాజకీయాలకు వెళ్లడం జరుగుతుందని ఎంపీ చెప్పారు. జాతీయ పార్టీ పెట్టి రైతులకు అనుకూలంగా ఉండే చట్టాలు కెసిఆర్ తెస్తడని ఆయన వెల్లడించారు. కేంద్ర బిజెపి కి సరైన మొగోడు సిఎం కెసిఆరే అని అన్నారు. దేశ వనరులు కాపాడాలంటే సిఎం కెసిఆర్ దేశ రాజకీయాలకు పోవాలని ఆకాంక్షించారు. తెలంగాణ ఉద్యమం తరహా అందరు ఏకతాటిపైకి వచ్చి కెసిఆర్ ను ఆశీర్వదించాలని.. దేశాన్ని అభివృద్ధి దిశగా అడుగులు వేయాలని ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి అన్నారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకుడు రొట్టె రాజమౌళి, జెడ్పిటిసి రవిందర్ రెడ్డి, కౌన్సిలర్లు, టిఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.
...
https://www.youtube.com/watch?v=bpce8AxKzpg