#s2news #s2newsraghunandanrao #s2newsraghunandanraosong
18 సంవత్సరాలు నిండి పెళ్లి చేసిన ప్రతి ఆడబిడ్డ కు రాష్ట్ర ప్రభుత్వం కళ్యాణ లక్ష్మి పథకం కింద ఒక లక్ష 116 రూపాయిలు అందజేస్తుందని ఎమ్మెల్యే రఘునందన్ రావు అన్నారు. నిరుపేదలను దృష్టిలో పెట్టుకొని వారి ఆడబిడ్డ పెళ్లి కి ఆసరా కావాలనే లక్ష్యంతో ఈ కార్యక్రమం చేపట్టడం జరిగిందన్నారు. సిద్దిపేట జిల్లా రాయపోల్ మండల కేంద్రంలో లబ్ధిదారులకు కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రఘునందన్ రావు మాట్లాడుతూ అవినీతికి ఆస్కారం లేకుండా పారదర్శకంగా కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ చేయడం జరుగుతుందని అన్నారు. ఎవరైనా కళ్యాణలక్ష్మి చెక్కుల విషయంలో డబ్బులు అడిగి నట్లయితే తమ దృష్టికి తీసుకురావాలని సూచించారు. కులాలకు, మతాలకు అతీతంగా అందరికీ న్యాయం జరిగేలా కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం చేపట్టడం జరిగిందన్నారు. రాయపోల్ మండలంలో కళ్యాణ లక్ష్మి చెక్కుల విషయంలో కొంత మంది డబ్బులు అడిగినట్లు తమ దృష్టికి వచ్చిందని ఎమ్మెల్యే రఘునందన్ రావు అన్నారు. అలాంటి వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. రాష్ట్ర ప్రభుత్వం పేదలకు పంపిణీ చేసే పథకాలలో ఏ ఒక్కరికి లంచ
...
https://www.youtube.com/watch?v=KwyW0Mk4jgQ