శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి దేవస్థానం నందు శ్రీ స్వామివారి శివరాత్రి బ్రహ్మోత్సవాల ఏర్పాట్లను పురస్కరించుకొని , చిత్తూరు జిల్లా కలెక్టర్ ప్రద్యుమ్న ఆలయంలోని ఏర్పాట్లను పర్యవేక్షించారు. అనంతరం వివిధ ప్రభుత్వ శాఖలతో సమీక్షా సమావేశం దేవస్థాన కార్యాలయ సమావేశ మందిరం నిర్వహించారు అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ ఈ శివరాత్రి బ్రహ్మోత్సవాలలో భక్తులకుఎటువంటి ఇబ్బంది జరగకూడదని అన్నదానం నందు భక్తులు అన్న ప్రసాదానికి ఎటువంటి ఇబ్బంది లేకుండా చూడాలని అదే విధంగా భక్తులు రాత్రి నిద్ర పోవడానికి సరైన వసతులు కల్పించాలని క్యూలైన్లలో వచ్చే భక్తులకు మంచినీళ్ల సదుపాయం మజ్జిగ లు ఇవ్వాలని అదేవిధంగా క్యూ లైన్ పరిస్థితి ఇబ్బందిగా ఉన్నవారికి దగ్గర్లోని మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేయాలని ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూసుకోవాలని వృద్దులకు ప్రత్యేకక్యూ లైన్లు ఏర్పటుచేయలని దర్శనాన్నికి వచ్చిన పిల్లలకు ట్యాగులు ఏర్పటు చేయలని విఐపి లకు బ్రేక్ సమయంలో మాత్రమే దర్శన ఏర్పట్లు చేయలని విఐపి వల్ల సామన్య భక్తులకు ఏటువంటి ఇబ్బందులు ఉండకూడదని అన్నారు సీసీ కెమెరా పర్యవేక్షణలో అధికారులు ఉండాలని ఎక్కడా ఎటువంటి అవాంచనీయ సంఘటనలు జరిగిన లేక భక్తులకు ఇబ్బంది జరిగిన వాలంటీర్ల ద్వారా వెంటనే భక్తులకు మెరుగైన సేవలు కల్పించాలని అదేవిధంగా గుడి పరిసర ప్రాంతంలో సుభ్రత పాటించాలని ఏటువంటి చెత్త చెదారాలు నిలువ ఉంచకూడదని భక్తులకు మరుగుదొడ్లు ఎక్కువగా పెట్టాలని కలెక్టర్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు
#s2news #raghunandanrao #bjp
దుబ్బాక లో బిజెపి ఎమ్మెల్యే గా రఘునందన్ రావు గెలుపు రాష్ట్ర రాజకీయాలను మార్చింది అని మిజోరం మాజీ గవర్నర్ కుమ్మనం రాజశేకరన్ అన్నారు. దుబ్బాక ఉప ఎన్నికల గెలుపు బిజెపి కి తెలంగాణ లో పునాదిలాంటిదని పేర్కొన్నారు. సిద్దిపేట జిల్లా దుబ్బాక క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే రఘునందన్ రావు తో కలిసి మిజోరం మాజీ గవర్నర్ కుమ్మనం రాజశేకరన్ ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో క్షేత్ర స్థాయి పరిశీలన కోసం 119 నియోజకవర్గాలకు ఒక్కో నియోజకవర్గానికి ఒక్కో సీనియర్ నాయకులను పంపడం జరిగిందని తెలిపారు. అందులో భాగంగానే దుబ్బాక నియోజకవర్గంలో తాను రెండు రెండు రోజుల పర్యటన ఉందన్నారు. విద్య, వైద్యం, చేనేత, వ్యవసాయ, కార్మిక రంగాలతో పాటు పలు గ్రామాల్లో పర్యటించి పూర్తి నివేదికను కేంద్రానికి అందజేస్తామన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రజలు మార్పు కోరుకున్నారని అందుకు దుబ్బాక గెలుపే నిదర్శనం అన్నారు. 2023 లో తెలంగాణ లో బిజెపి గెలుపే లక్ష్యంగా నాయకులు, కార్యకర్తలు కృషి చేయాలని కోరారు. రాష్ట్రపతి ఎన్నికల్లో టిఆర్ఎస్ పార్టీ యశ్వంత్ సిన్హా కు మద్దతు ఇస్తామని చెప్పడం కాంగ్రెస్, టిఆర్ఎస్ భవిష్యత్తు రాజకీయాలకు కలయిక అన్నారు. సిఎం స్వంత జిల్లా లోనే రఘునందన్ రావు బిజెపి జెండా ఎగురవేసినప్పుడు రానున్న ఎన్నికల్లో రాష్ట్రంలో బిజెపి జెండా ఎగరడం ఖాయం అన్నారు. ఈ సందర్భంగా ఆయన ను స్థానిక ఎమ్మెల్యే రఘునందన్ రావు పుష్పగుచ్చం ఇచ్చి శాలువాతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో బిజెపి నాయకులు బాలేష్ గౌడ్, ఎస్ఎన్ చారి, శ్రీనివాస్, ప్రవీణ్, వెంకట్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
...
https://www.youtube.com/watch?v=VGaKGTFa4JE