#harishrao #sunflower #siddipet
దక్షిణ భారత దేశ ధాన్యగారంగా తెలంగాణ రాష్ట్రాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ తీర్చిదిద్దారని రాష్ట్ర మంత్రి హరీశ్ రావు వెల్లడించారు.
దేశంలో వ్యవసాయం వృద్ధి రేటు 4% శాతం ఉంటే, కేవలం తెలంగాణ రాష్ట్రంలో 7.8% శాతం ఉన్నదని అన్నీ రంగాలలో తెలంగాణ రాష్ట్రం రోల్ మోడల్ గా నిలిచిందని మంత్రి హరీశ్ రావు పేర్కొన్నారు.
జిల్లా కేంద్రమైన సిద్ధిపేట పత్తి మార్కెట్ యార్డులో రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో పొద్దు తిరుగుడు పువ్వు కొనుగోలు కేంద్రాన్ని మార్కెట్ కమిటీ చైర్మన్ మచ్చ విజిత వేణుగోపాల్ రెడ్డితో కలిసి మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. పొద్దు తిరుగుడు పువ్వు సాగు చేసిన రైతులకు శుభవార్తగా చెబుతూ.. కొనుగోలు కేంద్రాలు ప్రారంభించినట్లు, రైతులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. తెలంగాణలో కాళేశ్వరం ప్రాజెక్టు వచ్చాక పొద్దు తిరుగుడు పువ్వు సాగు పెరిగింది. ఈ యేడు 6200 ఎకరాల్లో రైతులు పొద్దు తిరుగుడు సాగు చేశారు.
మార్కెట్ ధర తక్కువ ఉన్నదని పొద్దు తిరుగుడు పువ్వు కొనుగోలు కేంద్రాలు ప్రభుత్వం ప్రారంభించాలని రైతుల కోరిక మేరకు సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లి, వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డిల నిర్ణయంతో ఈ పొద్దు తిరుగుడు కొనుగోలు కేంద్రాలు ప్రారంభించినట్లు మంత్రి తెలిపారు.
రాష్ట్రంలో మొదటి పొద్దు తిరుగుడు కొనుగోలు కేంద్రం సిద్ధిపేటలో ప్రారంభమైందని, రూ.6400 మద్ధతు ధరతో ప్రభుత్వానికి అమ్మితే రైతులకు ఉపయోగకరమని మంత్రి పేర్కొన్నారు.
జిల్లాలో 60 మెట్రిక్ టన్నుల పొద్దు తిరుగుడు పంట పండుతుందని వ్యవసాయ శాఖ అధికారులు అంచనా వేసినట్లు, జిల్లాలో 6 వేల మంది రైతులు పొద్దు తిరుగుడు సాగు చేసినట్లు తెలిపారు.
సీఎం కేసీఆర్ వచ్చాక రైతుకు భరోసా దొరికిందని, కేంద్రం వడ్లు కొనమని చెప్పినా.. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వడ్లు కొని రైతులకు సహకారాన్ని అందించిందని చెప్పుకొచ్చారు.
సమైక్య రాష్ట్రంలో ఆనాడు అనేక తంటాలు పడేవారని, ఇవాళ తెలంగాణలో ప్రతిగింజకు కాంటాలు వచ్చాయని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సాధించిన అద్భుతమైన విజయం ఇది అని మంత్రి ధీమాగా చెప్పారు.
ఆనాడు సమైక్య రాష్ట్రంలో యాసంగిలో 10 లక్షలు ఎకరాలు సాగు అయ్యేది కాదని, కానీ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత యాసంగిలో 53 లక్షల ఎకరాల వరి సాగు అవుతుందని తెలిపారు.
దేశంలో ఏ రాష్ట్రంలో ఎక్కడా కూడా వరి సాగు కావడం లేదని, దేశంలోని ఉత్తర ప్రదేశ్, తమిళనాడు, ఆంద్రప్రదేశ్, మధ్యప్రదేశ్ లు భౌగోళికంగా చాలా పెద్దవైన వరి సాగు జరగడం లేదని అన్నారు.
ఆనాడు తెలంగాణలో పని దొరకక ఉండేవారనీ, ఇవాళ తెలంగాణలో పని చేసేందుకు 16 రాష్ట్రాల ప్రజలు తెలంగాణ రాష్ట్రంలో పని చేస్తున్నారని, తెలంగాణ రాష్ట్రం ప్రజలకు పని ఇవ్వడంతో పాటు, పక్క రాష్ట్రాలకు ఉపాధి కల్పిస్తుందని మంత్రి వివరించారు.
నాడు-నేడు చూస్తే.. ఒకనాడు వ్యవసాయం దండగ అంటే.. ఇవాళ తెలంగాణలో పండుగ నెలకొందని, తెలంగాణలో నీళ్లు ఫుల్, కరెంటు ఫుల�
...
https://www.youtube.com/watch?v=15XLitSM_W0
మెదక్ జిల్లా చేగుంట మండలం కర్నాల్ పల్లి గ్రామంలో మల్లన్న సాగర్ కాలువల నిర్మాణానికి సర్వే కోసం వచ్చిన అధికారులను రైతులు అడ్డుకున్నారు తమ పట్టా భూముల నుండి కాలువలు తీయవద్దని ఆగ్రహం వ్యక్తం చేశారు చేగుంట గజ్వేల్ ప్రధాన రహదారిపై బైఠాయించి ఆందోళన నిర్వహించారు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు సంవత్సరాల తరబడి భూములను నమ్ముకొని జీవిస్తున్న తమకు ప్రభుత్వం అన్యాయం చేస్తుందని తమ భూముల నుండి కాల్వల నిర్మాణం చేపడితే తమకు ఆత్మహత్యలే శరణ్యమని ఎట్టి పరిస్థితుల్లో తమ భూములు ఇచ్చే పరిస్థితి లేదని బలవంతంగా తమ భూములు లాక్కుంటే ఆత్మహత్య చేసుకుంటామని వారు హెచ్చరించారు బడాబాబుల భూములు వదిలి నిరుపేద రైతుల భూముల గుండా కాలువ తవ్వడానికి అధికారులు ప్రయత్నిస్తున్నారని కోట్ల విలువ గల తమ భూములను ఎట్టి పరిస్థితుల్లో ఇచ్చే ప్రసక్తి లేదని రైతులు హెచ్చరించారు
...
https://www.youtube.com/watch?v=f1mgcSXXep4