#chiruthalaramayanam #puli #bayam
గత కొద్దిరోజులుగా దుబ్బాక శివారులోని అటవీ ప్రాంతంలో పులి సంచారం చేస్తుందంటూ పుకార్లు షికార్లు చేసిన విషయం తెలిసిందే. కమ్మర్ పల్లి, మ ల్లాయి పల్లి గ్రామాల్లో పశువులపై అడవి జంతువులు దాడి చేసిన విషయాన్ని తెలుసుకొని అటవీశాఖ అధికారులు కాలి ముద్రలను గుర్తించారు. జంతువుల అడుగులను గుర్తించిన అటవీశాఖ అధికారులు చిరుత పులి సంచారం చేస్తుందని ఎవరు కూడా అటవీ ప్రాంతంలోకి వెళ్ళవద్దని చుట్టుపక్క గ్రామాల ప్రజలకు హెచ్చరికలు చేశారు. కొద్దిరోజులుగా సర్దుమరిగిన విషయం నేడు పులి పిల్లలు కనిపించడంతో గ్రామస్తులు ఆందోళనకు గురవుతున్నారు. సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం చికోడ్, రామక్కపేట గ్రామ శివారులోని మచ్చేందర్ తన వ్యవసాయ పొలం వద్ద ఉన్న బావి గుంతలో పులి పిల్లలను చూసి అక్కడ నుండి పరుగులు తీసి గ్రామస్తులకు సమాచారం అందించాడు. వెంటనే గ్రామస్తులు అక్కడికి వెళ్లి చూసేసరికి పులి పిల్లలు కనిపించకుండా పోయాయి. ఇదే విషయాన్ని అటవీ శాఖ అధికారులకు గ్రామస్తులు తెలియజేశారు. అక్కడ ఉన్న కాలిముద్రలను అటవీ శాఖ అధికారులు గుర్తించి పులిపిల్లల లేక ఇతర జంతువుల తేల్చాల్సిన అవసరం ఎంతైనా ఉంది. గత కొద్ది రోజులుగా దుబ్బాక శివారులోని రామక్కపేట, ఛీకోడ్, కమ్మర్పల్లి, మళ్ళాయి పల్లి గ్రామాల్లోని ప్రజలకు పులి భయం వెంటాడుతూనే ఉంది. అటవీ శాఖ అధికారులు అడవిలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. ఇప్పటికైనా అటవీ ప్రాంతంలో సంచరిస్తున్న చిరుత పులిని అటవీ శాఖ అధికారులు పట్టుకోవాలని కోరుతున్నారు.
...
https://www.youtube.com/watch?v=X-hR12zk4uE
ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో అన్నదాతలు ఇబ్బందులు పడుతున్న అధికార పార్టీ నాయకులకు కనిపించకపోవడం సిగ్గుచేటని కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్చార్జ్ శ్రీనివాస్ రెడ్డి అన్నారు. తడిసిన ప్రతి ధాన్యం గింజను కొనుగోలు చేస్తామని చెబుతున్న ప్రజా ప్రతినిధులు ఎక్కడ కొనుగోలు చేశారో తెలియజేయాలని డిమాండ్ చేశారు. అధికార పార్టీ నాయకులు చెప్పేది ఒకటి, చేసేది మరొకటని విమర్శించారు.
సిద్దిపేట జిల్లా మిరుదొడ్డి మండలం వీరారెడ్డిపల్లి, మల్లుపల్లి, అల్వాల గ్రామాల్లోని కొనుగోలు కేంద్రాలను కాంగ్రెస్ దుబ్బాక నియోజకవర్గ ఇన్ఛార్జ్ చెరుకు శ్రీనివాస్ రెడ్డి సందర్శించారు. కొనుగోలు కేంద్రాల్లో రైతులు నెల రోజులుగా పడిగాపులు కాస్తున్నామని వాపోయారు. వర్షాలు పడి ధాన్యం తడిసి మొలకెత్తిన ఎవరు పట్టించుకోవడం లేదని ఆరోపించారు. ఒక్కో కొనుగోలు కేంద్రంలో సుమారు నాలుగు రోజుల నుండి లారీలు రాక రైతులు ఇబ్బందులు పడుతున్న అధికారులు ఎవరు పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. తడిసి ధాన్యం మొలకెత్తిన అధికారులు రైతుల పట్ల కనికరం చెప్పకపోవడం బాధాకరమన్నారు. తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేస్తామని వాగ్దానం చేసిన అధికార పార్టీ నాయకులు కొనుగోలు కేంద్రాలకు రావడానికి మక్��
...
https://www.youtube.com/watch?v=RF1Mwl-VYMY