#nkd #nkdgraphics #s2news
వసంత పంచమి సందర్భంగా లయన్స్ క్లబ్ ఆఫ్ నారాయణ ఖేడ్ ఆధ్వర్యంలో సాయినగర్ కాలనీలోని నిరుపేద 60 మంది విద్యార్థులకు భవానీ గ్రాఫిక్స్ లయన్ సోదరులు రవి , రాజు , వొతే చంద్రశేఖర్ సహాకారాలతో పలకలు , నోట్ బుక్స్ పంపిణీ చేసి విద్యార్థులందరికి వసంత పంచమి శుభాకాంక్షలు తెలిపారు . ఈ కార్యక్రమంలో డైరెక్టర్లు లయన్ భోజ్ రెడ్డి , లయన్ రవికుమార్ , వెంకట్రావు , జిల్లా క్యాబినెట్ సభ్యులు వొతే చంద్రశేఖర్ , లయన్ రాజ్ కుమార్ , లయన్ మన్మధ , కిషోర్ , రవీందర్రావులు పాల్గొన్నారు .
...
https://www.youtube.com/watch?v=fkj9TwahEfk
ఈనెల 7 వ తేదీ న సిద్దిపేట జిల్లా అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం (ఐద్వా) జిల్లా మహాసభలను జయప్రదం చేయాలని దుబ్బాక లో కరపత్రం విడుదల చేస్తున్న ఐద్వా నాయకులు అనంతరం ఐద్వా జిల్లా ఉపాధ్యక్షురాలు ఎస్.నవీన మాట్లాడుతూ దేశంలో రోజురోజుకు మహిళలపై దాడులు దౌర్జన్యాలు పెరుగుతున్నాయని మహిళల రక్షణ కొరకు కేంద్ర ప్రభుత్వం ఎలాంటి చర్యలు చేపట్టకుండా మహిళా వ్యతిరేక విధానాలతో బిజెపి కేంద్ర ప్రభుత్వం పరిపాలన కొనసాగిస్తుందని విమర్శించారు. ప్రస్తుతం మహిళలు పోరాడి సాధించుకున్న హక్కులను సైతం నిర్వీర్యం చేసే కుట్రలు చేస్తోందని మండిపడ్డారు.దేశంలో మహిళలపై అనేకచోట్ల హత్యలు, అత్యాచారాలు జరుగుతున్నా కేంద్ర ప్రభుత్వం పట్టీపట్టనట్లు వ్యవహరిస్తుందని విమర్శించారు. గృహహింస చట్టం సరైన విధంగా అమలు కావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.మహిళలకు గౌరవించే పద్ధతిలో మహిళా చట్టాలను పకడ్బందీగా అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈరోజు పెరుగుతున్న ధరలను వెంటనే నిర్మూలించి మహిళల కోసం పని చేయాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో ఐద్వా మండల అధ్యక్షురాలు, యాదమ్మ, కార్యదర్శి మౌనిక, నాయకులు,మానస, హిమబిందు, తదితరులు పాల్గొన్నారు.
...
https://www.youtube.com/watch?v=BLsXM1CRyzQ
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దేవాలయాల అభివృద్ధి కోసం కృషి చేస్తున్నది అని మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి అన్నారు , చేగుంట మండలం కర్నాల్ పల్లి ఎల్లమ్మ దేవాలయ వార్షికోత్సవం సందర్భంగా ఎల్లమ్మ దేవాలయం లో మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి ప్రత్యేక పూజలు చేశారు , ఆలయ ప్రాంగణంలో ఎలాంటి ప్లాస్టిక్ వస్తువులు ఉండకుండా చూడాలని ఆలయ కమిటీ చైర్మన్ రామ గౌడ్ కి సూచించారు , అనంతరం ఆలయ కమిటీ చైర్మన్ జనగామ రామ గౌడ్ , ఇబ్రహీంపూర్ సొసైటీ చైర్మన్ కొండల్ రెడ్డి ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి ని సన్మానించారు ఈ కార్యక్రమంలో డీసీసీబీ డైరెక్టర్ బక్కీ వెంకన్న , కర్నాల్ పల్లి సర్పంచ్ సంతోష్ రెడ్డి మాజీ సొసైటీ చైర్మన్ రఘు రాములు నాయకులు శివ , అశోక్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు .
...
https://www.youtube.com/watch?v=c5ibK3-mbbI