#s2news #acb #chegunta
ఏసీబీ వలలో పట్టుబడ్డ నాయబు తాసిల్దార్.
చేగుంట తాసిల్దార్ కార్యాలయంలో పనిచేస్తున్న నాయబు తాసిల్దార్ చంద్రశేఖర్ ఏసీబీ దాడులలో పట్టుబడ్డాడు. హైదరాబాద్ కు చెందిన రఘునాథ్ రెడ్డి అనే ప్రభుత్వ ఉద్యోగి మండల పరిధిలోని గొల్ల పల్లి , రాంపూర్ గ్రామ శివారు లోని 122. సర్వెనేభర్ లో 8 ఎకరాల వ్యవసాయ భూమిని కొనుగోలు చేశాడు. అట్టి 1 33 గుంటల వ్యవసాయ భూమి కొనుగోలు విషయంలో రెవెన్యూ కు సంబంధించి సమస్యలు ఏర్పడగా దాన్ని పరిష్కరించాలని నాయబు తహశీల్దార్ చంద్రశేఖర్ ను ఆశ్రయించారు. అంతేకాకుండా తన పొలంలోని మూడెకరాల విస్తీర్ణాన్ని మరో వ్యక్తికి పట్టా చేయడంతో దాని పరిశీలించాలని కోరగా ఐదు లక్షల రూపాయల లంచం అడిగాడు. గత నెల రోజుల నుండి పనులు చేయకుండా విసిగించడంతో గురువారం ఏసీ ఏసీబీ అధికారులకు సమాచారం అందించారు. 4 లక్షల 50 వేలు రూపాయల నగదును డిప్యూటీ తాసిల్దార్ చంద్రశేఖర్ వేరే వ్యక్తి ని పంపించి తీసుకున్నాడు 4.5 లక్షల రూపాయల డిమాండ్ చేయగా అందులో 2 లక్షల 70 వేలు నగదు తీసుకున్న విషయాన్ని ధృవీకరించుకున్న నా యబు తహసిల్దార్ చంద్రశేఖర్ రెవెన్యూ పనులు చేస్తానని రఘునాథరెడ్డికి సమాచారం అందించారు. వెంటనే ఏసీబీ అధికారులు తాసిల్దార్ కార్యాలయం చేరుకుని 2 లక్షల 70 వేలు తీసుకున్న వ్యక్తిని తయాసిల్దర్ కార్యాలయం ముందుకు తీసుకువచ్చి పంచనామా నిర్వహిస్తున్నారు. ఎసిబి డిఎస్పీ ఆనంద్ కుమార్ మాట్లాడుతూ గొల్లపల్లి లో 33 గుంటల భూమి పౌతి 1 ఎకరా రిజిస్ట్రేషన్ కోసం అనిల్ అనే వ్యక్తి ని మధ్యవర్తి గా పెట్టి లంచం అడిగి తీసుకున్నారు, ఒక్కేసారి ఇ వ్వలేను అనగా రెండు విడతల తీసుకునేందుకు ఒప్పందం కుదిరింది, సంబంధించి విచారణ జరిపి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఏసీబీ DSP ఆనంద్ కుమార్ తెలిపారు.
...
https://www.youtube.com/watch?v=8zXSDlwMhfI