ఇటీవల సౌదీ అరేబియా లో రోడ్డు ప్రమాదంలో మరణించిన దుబ్బాక మండలం రాజక్క పేట గ్రామానికి చెందిన మొగుళ్ళ మధు కుటుంబ సభ్యులను ఈరోజు దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు పరామర్శించారు. సౌదీ నుండి మృత దేహాన్ని తొందరగా స్వగ్రామానికి తీసుకురావడానికి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితో మాట్లాడారు. భారత ప్రభుత్వం సౌదీ ఎంబసీ తో మాట్లాడి మృతదేహాన్ని భారతదేశానికి తరలిస్తామని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు.
...
https://www.youtube.com/watch?v=_2aErDVG3fw
#mla #raghunandanrao
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కాంట్రాక్టు ఉద్యోగులు లేకుండా చేస్తానని చెప్పిన ముఖ్యమంత్రి కేసీఆర్ మాట తప్పడం సిగ్గుచేటని ఎమ్మెల్యే రఘునందన్ రావు విమర్శించారు. నేటికీ ఉద్యోగులు హక్కుల సాధన కోసం సమ్మెలు చేస్తున్న ప్రభుత్వం పట్టించుకోకపోవడం బాధాకరమన్నారు.
సిద్దిపేట జిల్లా దుబ్బాక పట్టణంలో ఆశా కార్యకర్తలు చేస్తున్న సమ్మెకు ఎమ్మెల్యే రఘునందన్ రావు సంఘీభావం తెలిపారు. తమ న్యాయమైన డిమాండ్ల సాధన కోసం ఆశా కార్యకర్తలు సమ్మె చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోకపోవడం పై అసహనం వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కాంట్రాక్టు ఉద్యోగులను పర్మినెంట్ చేస్తానని ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పి నేటికీ హామీని నెరవేర్చలేదన్నారు. కనీస వేతనం కోసం ఆశా కార్యకర్తలు సమ్మె చేస్తున్న పట్టించుకోకపోవడం బాధాకరమన్నారు. తెలంగాణ రాష్ట్రంలో అంగన్వాడీలు , పంచాయతీ కార్యదర్శులు, ఆశా కార్యకర్తలు, గ్రామపంచాయతీ కార్మికులు ఇలా కార్మికులు తమ హక్కుల కోసం సమ్మె చేయాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా ఇచ్చిన హామీ ప్రకారం కాంట్రాక్టు కార్మికులను రెగ్యులర్ చేయాలన్నారు.
...
https://www.youtube.com/watch?v=Lww_g11Z6-A
జిల్లా కేంద్రమైన సిద్ధిపేట కోమటి చెరువు పై గ్లో గార్డెన్ ను ప్రారంభించిన రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు, ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి. మంత్రి వెంట టూరిజం ప్రిన్సిపల్ సెక్రటరీ శ్రీనివాస రాజు, మున్సిపల్ చైర్మన్ రాజనర్సు, సుడా చైర్మన్ రవీందర్ రెడ్డి, ఇతర ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
- రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు కామెంట్స్:
- కేసీఆర్ సిద్దిపేట ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కోటి అందాలతో కోమటి చెరువు ముస్తాబు అవుతుందని పాడిన పాటను, కేసీఆర్ కలలు గన్న సిద్దిపేటను
ఇవాళ నిజం చేస్తున్నాం., పట్టణ ప్రజలకు అందిస్తున్నాం.
- రేపు కోమటి చెరువు పై మ్యూజికల్ పౌంటెయిన్ ప్రారంభం చేయనున్నాం.
- సిద్దిపేట అభివృద్దిని చూడడానికి ఇతర ప్రాంతాల నుంచి వస్తున్నారు.
- ప్రజల కష్టసుఖాలు, అభివృద్దితో పాటు ఆహ్లాదంలో కూడా పాలు పంచుకుంటున్నాం.
- గతంలో ఆహ్లాదం కోసం కుటుంబ సభ్యులతో కలిసి ఇతర ప్రాంతాలకు వెళ్ళేవారు. కానీ ఇవాళ సిద్ధిపేట కోమటి చెరువుపై సేద తీరి ఆహ్లాదాన్ని, మానసిక ఉల్లాసాన్ని ఉత్సాహాన్ని పొందుతున్నారు.
- రూ.25 కోట్ల రూపాయలతో మిగతా నెక్లెస్ రోడ్ ను త్వరలోనే పూర్తి చేస్తాం.
- రూ.50 లక్షల రూపాయలతో నిర్మించే వాలీబాల్ అకాడమీ ఇవాళ మంజూరైంది.
- రూ.2 కోట్ల �
...
https://www.youtube.com/watch?v=Motw8Lq0PkE