#dubbakmpp #s2news #trsmpp
రైతులు బాగుంటే రాష్ట్రం బాగుంటుందనే లక్ష్యంతో ముఖ్యమంత్రి కెసిఆర్ కృషి చేస్తున్నారని ఎంపిపి కొత్త పుష్పలత అన్నారు. అందులో భాగంగానే రైతు బంధు పథకం ప్రవేశపెట్టి రైతన్నలకు అండగా నిలుస్తున్నారని పేర్కొన్నారు. సిద్దిపేట జిల్లా దుబ్బాక మండల పరిషత్ కార్యాలయంలో సంబంధిత అధికారులతో కలిసి ఎంపిపి పుష్పలత రైతు బంధు సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రతి గ్రామంలో రైతు బంధు సంబరాలు జరుపుకోవాలని సూచించారు. రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 50 లక్షల కోట్ల రూపాయలు రైతు బంధు పథకం ద్వారా రైతుల ఖాతాల్లో జమ చేయడం జరిగిందని తెలిపారు. రైతుల పట్ల ముఖ్యమంత్రి ప్రవేశపెడుతున్న పథకాలు దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణ రాష్ట్రం అమలు చేశారని పేర్కొన్నారు. గతంలో ఏ ప్రభుత్వం కూడా రైతుల కోసం ఆలోచన చేయలేదని, ముఖ్యమంత్రి కెసిఆర్ వచ్చాక రైతులకు పెట్టుబడి సాయం కింద రైతు బంధు పథకం ప్రవేశపెట్టడం హర్షించ దగ్గ విషయం అన్నారు. రైతు బంధు సంబరాలకు ఏఈఓ లు, సర్పంచ్లు, ఎంపిటిసిలు, రైతన్నలు సారించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎంపిడిఓ భాస్కర్ శర్మ, రైతు సమన్వయ సమితి మండల అధ్యక్షుడు బాల్ రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీలేఖ, పలు గ్రామాల సర్పంచులు, ఎం
...
https://www.youtube.com/watch?v=l9T1haO0pmY