#bjp #mla #raghunandanrao
*తోగుట తహసీల్ కార్యాలయం వద్ద ఉద్రిక్తత*
నిర్వాసితులకు మద్దతుగా దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు
ఆదనపు టీఎంసీ కోసం భూములు కోల్పోయిన వారికి నష్టపరిహారం చెక్కులు వెంటనే ఇవ్వాలని భూనిర్వాసితుల ఆందోళన
చెక్కులు వచ్చినా నిర్వాసితులకు ఎందుకు ఇవ్వడం లేదని దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు ఆగ్రహం
వెంటనే నిర్వాసితుల కు చెక్కులు ఇచ్చేవరకు ఆందోళన అగదన్న రఘునందన్ రావు
...
https://www.youtube.com/watch?v=WBE_0ZirYc4
#s2news #aomallesham #agriculture
పంటలకు కావలసిన పోషకాల్లో భాస్వరం ఎంతగానో ముఖ్యమైందని వ్యవసాయ అధికారి మల్లేశం అన్నారు. సిద్దిపేట జిల్లా మిరుదొడ్డి మండలం రుద్రారం గ్రామంలో జీవన ఎరువు పై రైతులకు క్షేత్రస్థాయిలో అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా వ్యవసాయ అధికారి మల్లేశం మాట్లాడుతూ, వేర్ల పెంపకం, మొక్క ఎదుగుదలకు భాస్వరం దోహదపడుతుందన్నారు. బాస్వరం భూమిలో వేసినప్పుడు త్వరగా పంటకు లభ్యం కానీ రూపంలోకి మారిపోతుందన్నారు. రైతులు ఎక్కువ మోతాదులో బాస్వరం ఎరువులు వినియోగించడంతో, మన సాగు భూముల్లో గణనీయంగా భాస్వరం పెరిగిపోయిందన్నారు. భూమిలో లభ్యం కానీ బాస్వరం రూపాన్ని కరిగించి ఉపయోగపడే రీతిలో మార్చడానికి కొన్ని సూక్ష్మజీవులు దోహదపడతాయన్నారు. వరి, మొక్కజొన్న, ఇతర పంటలలో బాస్వరం ను కరిగించే జీవన ఎరువులు వాడుకోవచ్చని తెలిపారు. ఎకరాకి రెండు కిలోల జీవన ఎరువు లేదా 200 మిల్లీ లీటర్ల ద్రవ జీవన ఎరువులు సుమారు 100 నుండి 200 కిలోల పశువుల పేడలో కలిపి పంట పొలాల్లో చల్లాలని సూచించారు. జీవన ఎరువు వాడకంతో రైతులకు ఎంతగానో లబ్ధి చేకూరుతుందని తెలిపారు.
...
https://www.youtube.com/watch?v=1D8C1vbksq0