బ్రేకింగ్ న్యూస్... జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాదేవపూర్ మండలం అంబట్ పల్లి గ్రామంలోని బ్యాలెట్ బాక్స్ కౌంటింగ్ నిమిత్తం ఓపెన్ చేయగా బ్యాలెట్ బాక్స్ లోని ఓట్లు పూర్తిగా చెదలు పట్టినవి. ఇట్టి విషయం MPDO గారు, DPO గారు పరిశీలించి కలెక్టర్ గారికి సమాచారం అందించారు. పై అధికారుల ఆదేశాలు వచ్చేవరకు అట్టి బ్యాలెట్ బాక్స్ ను కౌంటింగ్ చేయకుండా ఆపివేయడం జరిగింది ఇట్టి బాలట్ బాక్స్ లో 395 ఓట్లు ఉన్నవి.. ... https://www.youtube.com/watch?v=nkLg1fpGcAA
రాజకీయాలను వ్యాపారం చేసిన పార్టీ నాయకులను ప్రజలు నమ్మి మోసపోవద్దని ధర్మ సమాజ పార్టీ మెదక్ పార్లమెంట్ అభ్యర్థి లక్ష్మణ్ అన్నారు. సిద్దిపేట జిల్లా దుబ్బాక పట్టణంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. పేద ప్రజల అభ్యున్నతి కోసం ధర్మ సమాజ పార్టీ కృషి చేయడం జరుగుతుందన్నారు. బీసీ ఎస్సీ ఎస్టీ కులాల ఓటర్లు ధర్మ సమాజ పార్టీకి ఓటు వేసి ఎంపీ అభ్యర్థిగా తనను గెలిపించాలని అభ్యర్థించారు. కాంగ్రెస్ బిజెపి బి.ఆర్.ఎస్ పార్టీలు పేద ప్రజల సంక్షేమాన్ని పూర్తిగా విస్మరించడం జరిగిందన్నారు., ధనార్జనే ధ్యేయంగా పార్టీలు పనిచేస్తున్నాయని ఓటర్లు గుర్తించి ఆ పార్టీలను ఓటు ద్వారా బొంద పెట్టాలని సూచించారు. రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో చెప్పుల గుర్తుకు ఓటు వేసి ధర్మ సమజ్ పార్టీని గెలిపించాలన్నారు.
...
https://www.youtube.com/watch?v=C-3kfGaUujQ
#s2news #harishrao #raghunandanrao
నిరంతరం 24/7 అందుబాటులో ఉంటూ ఈ ప్రాంత ప్రజలకు వైద్య సేవలు అందించాలని వైద్య అధికార సిబ్బందిని రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు ఆదేశించారు. సిద్ధిపేట జిల్లా దుబ్బాక నియోజకవర్గంలోని మండల కేంద్రమైన మిరుదొడ్డి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు.
పీహెచ్ సీ కేంద్రంలో డ్యూటీ డాక్టర్ ఎవరు.? ఏలాంటి స్పెషలైజేషన్ నిర్వహణ తీరును అడిగి తెలుసుకున్నారు. స్టాఫ్ అందరూ ఉన్నారా..? ఎవరెవరూ ఉన్నారని ఒక్కొక్కరుగా ఆరా తీశారు. కేంద్రంలో అన్నీ రకాల మందులు ఉన్నాయా అని అడిగి, మందులు లేవనే మాట రావొద్దని ఫార్మసిస్టుకు సూచించారు. ఉదయం 9 నుంచి సాయంత్రం 4 గంటల వరకూ ఫార్మాసిస్టు ఖచ్చితంగా ఉండాలని ఆదేశించారు. పీహెచ్ సీ పరిధిలోని నిధుల నిల్వ అంశంపై ఆరా తీసి, తిమ్మాపూర్ పీహెచ్ సీ కూడా కరెక్టు లేదని వెంటనే డీఏంహెచ్ఓతో మాట్లాడి హెచ్డీఎస్ నిధులు తెప్పించుకోవాలని పీహెచ్ సీ వైద్య వర్గాలను ఆదేశించారు.
ఏఎన్సీ పర్సంటేజీ ఎంత ఉంది.?, టీబీ శాంపిల్స్ తీసుకుంటున్నారా..? టీబీ రోగులకు డబ్బులు పడుతున్నాయా..లేదో వివరాలు అడిగి తెలుసుకుంటూనే ఇంకేమైనా ఇబ్బందులు ఉన్నాయా.. అంటూ ఆరా తీసి, హెచ్డీఎస్ డబ్బులు వాడుకునేలా ఆమోదం ఇవ్వ��
...
https://www.youtube.com/watch?v=tS7IQLBDuZE
#s2news #congress #cheruku
రోడ్డు ప్రమాదంలో తల్లిదండ్రులను కోల్పోయి అనాధలుగా మారిన చిన్నారులను కాంగ్రెస్ పార్టీ దుబ్బాక నియోజకవర్గ ఇన్చార్జి చెరుకు శ్రీనివాస్ రెడ్డి పరామర్శించారు. మిరుదొడ్డి మండలం కాసులాబాద్ గ్రామానికి చెందిన తిరుమలేష్, బాలమణి దంపతులు రోడ్డు ప్రమాదంలో మృతి చెందడం బాధాకరమన్నారు. భార్య భర్తలు ఇద్దరు మృతి చెందడంతో ఇద్దరు పిల్లలు అనాధలుగా మారడం పట్ల ఆవేదన వ్యక్తం చేశారు. అనంతరం బాధ్యత కుటుంబ సభ్యులను ఆయన పరామర్శించారు. రోడ్డు ప్రమాదంలో దంపతులు మరణించడం కలిచి వేసిందన్నారు. బాధిత కుటుంబాన్ని ప్రభుత్వ పరంగా ఆదుకోవాలని కోరారు. అనంతరం మృతుల కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు. అధైర్యపడవద్దని తామంతా అండగా ఉంటామని చిన్నారులను ఓదార్చారు. అనంతరం బాధిత కుటుంబానికి ఆర్థిక సాయం అందజేశారు. ఆయన వెంట కాంగ్రెస్ నాయకులు పలువురు పాల్గొన్నారు.
...
https://www.youtube.com/watch?v=84uVNTcU6Qc