#Scavengers #watertank #demand
ప్రభుత్వం పాఠశాలలో పనిచేస్తున్న స్కావెంజర్లను తొలగించడంతో మనస్థాపానికి గురైన స్కావెంజర్ వాటర్ ట్యాంక్ ఎక్కి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన దుబ్బాకలో చోటుచేసుకుంది. వాటర్ ట్యాంక్ ఎక్కి ఆత్మహత్య యత్నానికి ప్రయత్నించడంతో ఉత్కంఠ నెలకొంది.
సిద్దిపేట జిల్లా దుబ్బాక పట్టణానికి చెందిన బాలరాజు గర్ల్స్ హైస్కూల్లో స్కావెంజర్గా పనిచేసేవాడు. ప్రభుత్వం స్కావెంజర్లను తొలగించడంతో వీధిన పడ్డామని ఆవేదన వ్యక్తం చేశారు. గత మూడు సంవత్సరాలుగా పని లేక స్కావెంజర్లు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని, అయినా ప్రభుత్వం పట్టించుకోవడంలేదని ఆరోపించారు. మంత్రి హరీష్ రావు స్కావెంజర్లను తీసుకుంటామని మోసం చేయడం జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే స్కావెంజర్లను ప్రభుత్వం విధుల్లోకి తీసుకోవాలని వాటర్ ట్యాంక్ ఎక్కి నిరసన తెలుపడంతో పాటు ఆత్మహత్యయత్నంకు పాల్పడ్డాడు. విషయం తెలుసుకున్న స్థానిక పోలీసులు బాలరాజుకు నచ్చజెప్పి వాటర్ ట్యాంక్ పైనుండి కిందికి రప్పించడంతో ఉత్కంఠకు తెరపడింది.
...
https://www.youtube.com/watch?v=crUB-LHG8jU
మెదక్ స్థానిక సంస్థల నియోజక వర్గం నుండి తెలంగాణ శాసన మండలి సభ్యుని ఎన్నికకు సోమవారం నాడు నాలుగు నామినేషన్లు ధాఖలు అయ్యాయి. గజ్వేల్ నియోజక వర్గానికి చెందిన ఒంటెరి యాదవ రెడ్డి టి. ఆర్. ఎస్. పార్టీ నుండి నామినేషన్ ధాఖలు చేయగా, సంగారెడ్డి నియోజక వర్గానికి చెందిన బోయిని విజయలక్ష్మి, మెదక్ నియోజక వర్గానికి చెందిన ఐరేణి సత్యనారాయణ గౌడ్, గజ్వేల్ నియోజక వర్గానికి చెందిన సాయిబాబా చింతల లు స్వతంత్ర అభ్యర్థులుగా జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ హరీష్ కు నామినేషన్ పత్రాలు ధాఖలు చేశారు. నామినేషన్లు ప్రారంభమైన 16 నుండి నేటి వరకు ఉమ్మడి మెదక్ జిల్లా నుండి మొత్తం ఐదు మంది అభ్యర్థులు (6) నామినేషన్లు ధాఖలు చేశారు. అందులో స్వతంత్ర అభ్యర్థిగా ప్రవీణ్ కుమార్ ఈ నెల 18 న రెండు సెట్ల నామినేషన్ వేశారు.
...
https://www.youtube.com/watch?v=wUO-LGOLD88