#bjp #brs #kcr
రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉండి బి ఆర్ ఎస్ పార్టీకి ఓటు వేయాలని ఎస్సీ ఎస్టీ రాష్ట్ర కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య ప్రచారం చేయడం సిగ్గుచేటని ఎమ్మెల్యే రఘునందన్ రావు విమర్శించారు. ఎన్నికల సమయంలో రాబందుల్లా నియోజకవర్గానికి వచ్చి మోసపూరిత మాటలు చెప్పే నాయకుల మాటలు నమ్మవద్దని సూచించారు.
సిద్దిపేట జిల్లా దుబ్బాక నియోజకవర్గం లోని అక్బర్ పేట భూంపల్లి మండల కేంద్రంలో ఎమ్మెల్యే రఘునందన్ రావు ఆధ్వర్యంలో బిజెపి పార్టీ ఇంటింటా ప్రచారం నిర్వహించారు. భూoపల్లి గ్రామానికి వచ్చిన రఘునందన్ రావుకు మహిళలు బిజెపి నాయకులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, దళిత బంధు ఇస్తానని మాయమాటలు చెప్పి మోసం చేసిన బిఆర్ఎస్ పార్టీకి ప్రజలు గుణపాఠం చెప్పాలని సూచించారు. ఇటీవల ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ గా రాజ్యాంగం వద్ద పదవిలో కొనసాగుతున్న బక్కి వెంకటయ్య బి.ఆర్.ఎస్ పార్టీకి ఓటు వేయాలని ఫోన్ ద్వారా ప్రజలు కోరడం హాస్యాస్పదమన్నారు. తన పై ఎలాంటి వ్యక్తిగత శత్రుత్వం లేదని తెలిపారు. కోట్ల రూపాయలకు పడగనెత్తిన వెంకటయ్య ఇక్కడి దళితుల కోసం ఏం చేశారో తెలపాలన్నారు. చింతమడక గ్రామంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఏ విధంగా అయితే దళిత బంధు ఇచ్చారో , వెంకటయ్య భూంపల్లి గ్రామంలో ప్రతి కుటుంబానికి దళిత ఇవ్వాలని డిమాండ్ చేశారు. మంత్రి హరీష్ రావు, ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి మాయ మాటలు నమ్మి మరోసారి దుబ్బాక నియోజకవర్గం ప్రజలు మోసపోవద్దన్నారు. అనంతరం బి ఆర్ ఎస్ పార్టీలకు చెందిన పలువురు ఎమ్మెల్యే రఘునందన్ సమక్షంలో బిజెపి పార్టీలో చేరారు. ఈ కార్యక్రమంలో బిజెపి పార్టీ మండల అధ్యక్షుడు అరిగే కృష్ణ, మిరుదొడ్డి అధ్యక్షుడు దేవరాజు, నాయకులు బిక్షపతి, బాలేష్ గౌడ్, వెంకట్, భాను పలువురు పాల్గొన్నారు.
...
https://www.youtube.com/watch?v=SfvgJbrvces