#s2news #roadaccident #accident
సిద్దిపేట జిల్లా మిరుదొడ్డి మండలం ధర్మారం గ్రామం వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. ఎదురెదురుగా వస్తున్న రెండు వాహనాలు ఢీకొనడంతో ఇద్దరికీ గాయాలయ్యాయి. సిద్దిపేట నుండి మిరదొడ్డి వైపు వెళ్తున్న ద్విచక్ర వాహనం, ధర్మారం నుండి సిద్దిపేట వైపు వెళ్తున్న కారు ఎదురుగా ఢీకొన్నాయి. కారు ద్విచక్ర వాహనం ఢీకొనడంతో ద్విచక్ర వాహనంపై ఉన్న ఇరువురికి గాయాలయ్యాయి. ఆటోను ఓవర్ టేక్ చేయడానికి చూసిన ద్విచక్ర వాహనదారుడు ఎదురుగా వస్తున్న కారును గమనించకపోవడంతో ప్రమాదం చోటుచేసుకుందని స్థానికులు తెలిపారు. విషయం తెలుసుకున్న పోలీసులు వెంటనే సంఘటన స్థలానికి చేరుకొని క్షతగాత్రులను ప్రైవేటు వాహనంలో సిద్దిపేట ఏరియా ఆసుపత్రికి తరలించారు.
...
https://www.youtube.com/watch?v=9R3GYjWOcLM