తెలంగాణ అవతరణ దినోత్సవం రోజున దుబ్బాక కు సాగునీరు విడుదల చేయడం చాలా సంతోషంమన్నారు ఆర్థిక మంత్రి హరీష్ రావు. సిద్దిపేట జిల్లా తొగుట మండలం మల్లన్నసాగర్ నుండి దుబ్బాక నియోజకవర్గానికి కెనాల్ ద్వారా నీటిని విడుదల చేశారు మంత్రి హరీష్ రావు, ఎమ్మెల్యే రామలింగారెడ్డి.అనంతరం మంత్రి మాట్లాడుతూ కరువుకు, వలసలకు,ఆత్మహత్యలకు నిలయంగా ఉన్న దుబ్బాక ప్రాంతానికి ముఖ్యమంత్రి ఆశీస్సులతో సాగు నీరు, త్రాగు నీరు అందడం గర్వంగా ఉందన్నారు.తెలంగాణ ఉద్యమకారుల పోరాట ఫలితంగా దుబ్బాక కు సాగునీరు అని,కెనాల్ ప్యాకేజీ 12 ద్వారా లక్ష 25 వేల ఏకరాలకు సాగునీరు అందుతుందని,గోదావరి నీరుతో చెరువు లు నింపి అలుగులు పారిస్తుంటే కాంగ్రెస్ నాయకులకు కండ్లు కనపడతలేవా,గాంధీ భవన్ లో కూర్చుని మాట్లాడడం కాదు.. మా ప్రాంతానికి వచ్చి చూడాలన్నారు.మండుటెండల్లో మత్తడి దుంకుతుంటే రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారని,కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా ఒక్క ఎకరాకు నీరు రాలేదని ఉత్తమ్ మాట్లాడడం సిగ్గుచేటన్నారు.కాంగ్రెస్ నాయకులు రైతుల దగ్గరకెల్లి నిజాలను తెలుసుకోవాలని,కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారానే సూర్యపేట, వరంగల్, సిద్దిపేట జిల్లాలకు నీరందుతుందనే విషయాన్ని తెలుసుకోవాల నీ సూచించారు. ... https://www.youtube.com/watch?v=0-Dp5Ol2t3E
#s2news #harishrao #trs
సిద్దిపేట మున్సిపాలిటీ జూన్ 16 వ వార్డులో పట్టణ ప్రగతి కార్యక్రమంలో పాల్గొని 40 లక్షల రూపాయలతో సిసి రోడ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేసిన రాష్ట్ర ఆర్థిక మరియు వైద్యఆరోగ్యశాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు.
...
https://www.youtube.com/watch?v=UAjTyQVjfUk