రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు ఏదైనా అత్యంత అవసరమున్న వారు ఉదయం 6గంటల నుండి 10గంటల వరకు పూర్తి చేసుకొని లాక్ డౌన్ కు సహకరించాలని ఎమ్మెల్యే రఘునందన్ రావు సూచించారు. సిద్దిపేట జిల్లా దుబ్బాక పట్టణంలో కరోనా కట్టడి చర్యల్లో భాగంగా బుధవారం నూతన యంత్రంతో సోడియం హైపోక్లోరైట్ పిచికారి చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ ఛైర్ పర్సన్ గన్నె వనిత తో కలిసి ఎమ్మెల్యే రఘునందన్ రావు పాల్గొని మాట్లాడారు. ప్రజలు అందరూ లాక్ డౌన్ కు సహకరించాలని కోరారు. కరోనా రెండవ విడత అతి తొందరగా వ్యాప్తి చెంది ప్రజల ప్రాణాలను పొట్టనపెట్టుకుంటుందని, అలాంటి భయంకరమైన మహమ్మారిని తరిమికొట్టాలంటే ప్రభుత్వ సూచనలు తూచా తప్పకుండా పాటించాలని సూచించారు. అనవసరంగా భయటకు వచ్చి తమ ప్రాణాలను పోగొట్టుకోవద్దన్నారు. ప్రభుత్వ సూచనల మేరకు పట్టణంలోని మొదటి రోజు లాక్ డౌన్ కు వ్యాపార సంస్థలు, దుకాణ దారులు అందరూ 10గంటల వరకు తెరిచి 10గంటల నుండి మూసివేశారు. కార్యక్రమంలో మున్సిపల్ కౌన్సిలర్లు, టిఆర్ఎస్ నాయకులు, మున్సిపల్ సిబ్బంది, పట్టణ వాసులు పాల్గొన్నారు
...
https://www.youtube.com/watch?v=kcXrp3WsNX0
సిద్దిపేట జిల్లా ములుగు మండలం నాగిరెడ్డి పల్లి గ్రామంలోని రహస్యంగా గంజాయి చెట్లను పెంచుతున్న వ్యవసాయ పొలంలో ఎక్సయిజ్ అధికారులు ,ములుగు పోలీసులు కలిసి పొలం లో దాడులు నిర్వహించి పొలంలో ఉన్న సుమారు 42 గంజాయి చెట్లను గుర్తించి వాటిని స్వాధీనం చేసుకొని శాంపిల్స్ సేకరించి అక్కడే దగ్ధం చేశారు. గజ్వెల్ ఎక్సయిజ్ సి.ఐ. ప్రభావతి మాట్లాడుతూ సమాచారం మేరకు నాగిరెడ్డి పల్లి గ్రామంలోని నర్సింహారెడ్డి వ్యవసాయ క్షేత్రంలో మొక్కజొన్న పంట మధ్య గంజాయి మొక్కలు పెంచుతున్నారని నమ్మదగిన సమాచారం మేరకు పొలం దగ్గరికి వెళ్లి పరిశీలించగా సుమారు 42 గంజాయి మొక్కలు ఉన్నట్టు గుర్తించి వాటిని స్వాదినపరరుచుకొని వాటి శాంపిల్స్ సేకరించి మొక్కలను అక్కడికక్కడే దగ్ధం చేశామని ఎక్సయిజ్ సి.ఐ .ప్రభావతి తెలిపారు.ఇలాంటి చట్టవ్యతిరేకమైన పనులు చేసిన వారి పై పిడియాక్ట్ కేసులను నమోదు చేస్తామని హెచ్చరించారు.
...
https://www.youtube.com/watch?v=Kg5XifOVwlg