టిఆర్ఎస్ సభ్యత్వ నమోదులో దుబ్బాక నియోజకవర్గాన్ని రాష్ట్రంలోనే అగ్రగామిగా నిలిచేలా కార్యకర్తలు కృషి చేయాలని ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి అన్నారు. సిద్దిపేట జిల్లా మిరుదొడ్డి మండల కేంద్రంలోని ఓ ఫంక్షన్ హాల్ లో తొగుట, మిరుదొడ్డి మండల టిఆర్ఎస్ ముఖ్య కార్యకర్తలతో ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి సమీక్ష సమావేశం నిర్వహించారు. అనంతరం సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ సీఎం కెసిఆర్ పాలనలో రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతుందన్నారు. సుపరిపాలనలో టిఆర్ఎస్ ప్రభుత్వం ఆదర్శంగా నిలుస్తుందన్నారు. సంక్షేమ పథకాలు అమలు చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం దేశంలో ప్రథమ స్థానంలో నిలుస్తుందన్నారు. బంగారు తెలంగాణ నిర్మాణంలో పార్టీలకతీతంగా ప్రజలు అందరూ భాగస్వాములు కావలన్నారు. సభ్యత్వ నమోదులో కార్యకర్తలు పోటీతత్వంతో మెలగాలన్నారు. సభ్యత్వ నమోదు ప్రక్రియ పూర్తి చేయాలని కార్యకర్తలకు సూచించారు. సభ్యత్వ నమోదులో నియోజకవర్గాన్ని రాష్ట్రంలో ప్రథమ స్థానంలో నిలిపేందుకు కార్యకర్తలు పాటుపడాలన్నారు .ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ ఫారుక్ హుస్సేన్, జెడ్పి చైర్ పర్సన్ రోజా శర్మ , రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాధాకృష్ణశర్మ , ఎంప
...
https://www.youtube.com/watch?v=-5pIhYvAnfE