*ఈరోజు స్థానిక ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో శాసనసభ్యులు రఘునందన్ రావు గారి ఆధ్వర్యంలో దుబ్బాక నియోజకవర్గ లో ఉన్నటువంటి డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు గురించి సమీక్ష సమావేశం నిర్వహించారు* *దీనికి సంబంధించిన అధికారులు*
*RDO గారు మరియు రెవెన్యూ అధికారులు తో ఈరోజు సమీక్ష సమావేశం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో*
*భాగంగా సిద్దిపేట RDO గారు PR-E PR -DE PR A లు గారు నియోజకవర్గ స్థాయి PR AE లు మరియు నియోజకవర్గ MRO లు పాల్గొన్నారు*....
...
https://www.youtube.com/watch?v=f-wuUR2NzBE
సిద్దిపేట జిల్లా తొగుట మండలం మల్లన్న సాగర్ ముంపు గ్రామమైన వేములఘాట్, పల్లెపహాడ్ నిర్వాసితులు కన్నీటి పర్యంతమయ్యారు. తమ గ్రామాన్ని ఖాళీ చేస్తూ ఒకరిపై ఒకరు పడి బోరుమని విలపించారు. పుట్టి పెరిగిన ఊరు, కష్టనష్టాలు అనుభవించిన జ్ఙాపకాలు, పంట పొలాలు, ఇంటి ఆనవాల్లు గుర్తు చేసుకుంటూ ఏడ్చారు. మళ్లీ ఎప్పుడు కలుసుకుంటామో, ఎవరెవరు ఎక్కెడెక్కడ ఉంటారో తెలియదని ఆవేదన వ్యక్తం చేశారు. పల్లెటూరిలో ఉండే ఆప్యాయత, అనురాగం అంతా వారి ఏడుపుతో పంచుకున్నారు. మళ్లీ మన ఊరు కనిపించకుండా పోతుందని, మనమెల్లిన చోట ఎలా ఉంటుందో తెలియదని ఒకరినొకరు ఓదార్చారు. నిర్వాసితులకు సంగాపూర్ లో ప్రభుత్వం కేటాయించిన డబుల్ బెడ్ రూమ్ ఇండ్లకు భయలుదేరారు. కాళీ చేసేముందు అందరు గ్రామ కషీర్ వద్ద కలుసుకొని ఒకరిపై ఒకరుపడి ఏడుస్తుంటే అక్కడున్నవారిని కంటతడి పెట్టిచ్చింది.
...
https://www.youtube.com/watch?v=UGSzA9X5soY
#s2news #bjp #raghunandanrao
దేశంలో నాటి నరేంద్రుని కళలను నిజం చేయడానికి అహర్నిశలు కృషి చేస్తున్న నాయకుడు నేటి భారత ప్రధాని నరేంద్ర మోడీ అని ఎమ్మెల్యే రఘునందన్ రావు అన్నారు. సిద్దిపేట జిల్లా దుబ్బాక పట్టణంలోని శ్రీనివాస థియేటర్ లో బిజెపి నాయకులతో కలిసి ది కాశ్మీర్ ఫైల్స్ సినిమా ను వీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చరిత్ర కారులు రాసిన చరిత్రను విద్యార్థులకు తిరిగి గుర్తు చేసే విధంగా కాశ్మీర్ ఫైల్స్ సినిమా నిర్మించడం జరిగిందని, సినిమా దర్శక నిర్మాతలకు అభినందనలు తెలిపారు. నరేంద్ర మోడీ ప్రధాని అయ్యాక ఆర్టికల్ 317 రద్దు చేసిన ఘనత మోడీదని గుర్తు చేశారు. త్వరలోనే రెండు రాష్ట్రాలకు ఎన్నికలు జరిగేందుకు కూడా మోడీ కృషి చేస్తానని తెలిపారు. జమ్మూ కాశ్మీర్ లాంటి సుందరమైన పట్టణాన్ని ఎంత భయంకరంగా చూపించి చరిత్ర ను ప్రజలకు తెలియజేసేందుకు ప్రయత్నం చేసిన సినిమా నిర్వాహకులకు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు బాలేష్ గౌడ్, మల్లారెడ్డి, మచ్చ శ్రీనివాస్, సుంకోజి ప్రవీణ్, వెంకట్ గౌడ్, రాజశేఖర్, సంపంగి అశోక్ తదితరులు పాల్గొన్నారు.
...
https://www.youtube.com/watch?v=ha5r88zXs5I
రాష్ట్ర ప్రభుత్వం పై, టిఆర్ఎస్ పార్టీపై దుబ్బాక ఎమ్మెల్యే మాధవనేని రఘునందన్ రావు అబద్దపు ప్రచారం చేస్తున్నారు.
అబద్దాలతో ఎమ్మెల్యే గా గెలిచిన విషయం అందరికీ తెలిసిందే.
నిన్నటి రోజు దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు తెలంగాణ ప్రభుత్వం పై విమర్శలు చేయడం విడ్డూరంగా ఉంది.
ఎల్కతుర్థిలో రోడ్డు తనే మంజూరు చేయించానని అబద్దము మాట్లాడారని చెప్పారు. ఆయన ఎమ్మెల్యే కాకముందే అది అమలులో ఉందని స్పష్టం చేశారు.
చేగుంట వద్ద ఫ్లైఓవర్ బ్రిడ్జి కూడా తానే తెచ్చానని చెప్పడం సరికాదన్నారు. మీ కేంద్ర మంత్రి గడ్కరిని అడగితే ఎప్పుడు తెచ్చామనేది ఆయనే చెప్తారన్నారు.
నేను కష్టపడి కేంద్ర మంత్రులతో మంజూరు చేయించిన పనులను నేను చేపించానని చెప్పడం బాధాకరం అన్నారు.
బిజెపి నాయకులకు అబద్ధాలు ఆడడం నైజం అని విమర్శించారు. ఆరు నెలల్లో మల్లన్నసాగర్ బాధితులు కు న్యాయం చేస్తానని ఎన్నికల ముందు చెప్పితివి ఇప్పుడు ఎందుకు నోరు మెదపడం లేదని అన్నారు.
మల్లన్నసాగర్ విషయం లో దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు పై దుబ్బాక ప్రజలకు అనుమానం కలిగిందన్నారు.
నిన్నటి రోజు గవర్నమెంట్ ను మెడలు వంచి పనిచేపిస్తానని మాట్లాడడం బాధాకరం అన్నారు.
సిఎం కెసిఆర్ ను విమర్శించే స్థాయి నీది కాదని
...
https://www.youtube.com/watch?v=oqHfIZNvghs