#mla #bjp #dubbak
సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం పలు గ్రామాల్లో ఎమ్మెల్యే రఘునందన్ రావు పర్యటించారు. గంభీర్పూర్, ఛీకోడ్, కమ్మర్పల్లి, అచ్చుమాయిపల్లి గ్రామాల్లో తన స్వంత నిధులతో ఏర్పాటు చేసిన హైమాస్ట్ లైట్ ను ఆయన ప్రారంభించారు. గ్రామాల్లో నెలకొన్న సమస్యలను గ్రామస్తులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ దుబ్బాక నియోజకవర్గ అభివృద్ధియే లక్ష్యంగా కృషి చేస్తానని తెలిపారు. నియోజకవర్గ అభివృద్ధికి అందరూ సాకరించాలని కోరారు. ఎన్నికలప్పుడే పార్టీలు తప్పా అభివృద్ధి విషయంలో కాదన్నారు. అనంతరం అచ్చుమాయిపల్లి లో ముత్యాలమ్మ గుడి నిర్మాణానికి భూమి పూజ చేశారు. ఆయన వెంట బిజెపి నాయకులు, కార్యకర్తలు, ఆయా గ్రామస్తులు ఉన్నారు.
...
https://www.youtube.com/watch?v=7kYu2qQ4TbI
#satyam #congress #jodoyatra
ఈ రోజు కూకట్ పల్లి నియోజకవర్గం ఫిరోజ్ గూడలో డా. బి ఆర్ అంబెడ్కర్ విగ్రహానికి పూలమాల వేసి అక్కడ నుంచి హత్ సే హత్ జోడో అభియాన్ యాత్ర ప్రారంభించిన పీసీసీ సభ్యులు డా. సత్యం శ్రీరంగం, MA, LL. M, రాష్ట్ర మహిళా ప్రధాన కార్యదర్శి పుష్పా రెడ్డి, రాష్ట్ర ఉపాధ్యక్షురాలు దుర్గా రాణి, ఏ బ్లాక్ అధ్యక్షులు పి. నాగి రెడ్డి, నల్లోల రాజేందర్, జావీద్ ఆలీ, విట్టల్ రెడ్డి, కొన్నింటి శామ్యూల్, నరసింహ యాదవ్, జ్యోతి, మొయినుద్దీన్, చిరుకోరు క్రిష్ణా, క్రిష్ణా రాజ్ పుత్, మట్టే ప్రసన్న కుమార్, మధు గౌడ్, మహేందర్, ముఖేందర్, హేమంత్, జల్లా శివ, సూర్య, శేఖర్ గజానంద్, భరత్, పుట్టపాక మధు, చంటి సింగ్ మరియు పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ నాయకులు, మహిళలు, కార్యకర్తలు పాల్గొన్నారు.
...
https://www.youtube.com/watch?v=NfLbYIR2TCE
రైతులను మోసం చేస్తున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఖరికి నిరసనగా టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి గారి పిలుపు మేరకు పబ్లిక్ గార్డెన్స్ నుంచి వ్యవసాయ కమిషనరేట్ వరకు నిర్వహించిన నిరసన ప్రదర్శనలో పాల్గొన్న డా. సత్యం శ్రీరంగం. ఈ సందర్బంగా సత్యం శ్రీరంగం మాట్లాడుతూ కెసిఆర్ రైతులు పండించిన ప్రతి గింజ కొంటామని ఒకసారి, వరి వేస్తే ఉరే అని మరోసారి ఇలా పొంతన లేని మాటలతో రైతులను ఆందోళనకు గురి చేస్తున్నారని, రాష్ట్రంలో టిఆర్ఎస్, బిజెపి కలిసి రైతులను మోసం చేస్తున్నాయని రాబోయే రోజుల్లో రైతులు మరియు రాష్ట్ర ప్రజానీకం మొత్తం ఈ రెండు పార్టీలకు బుద్ధి చెప్తారని నరేంద్ర మోదీని, కల్వకుంట్ల చంద్రశేఖర రావునీ గద్దె దింపే రోజులు దగ్గరలో ఉన్నాయని సత్యం శ్రీరంగం అన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మహిళా ప్రధాన కార్యదర్శి పుష్ప రెడ్డి, బండారి నవీన్ గౌడ్, రాజేందర్ నల్లోల, యుగంధర్ రెడ్డి, మధు గౌడ్, ఆకుల నరేందర్, మట్టే ప్రసన్న కుమార్, అస్లాం, ఉదయ్, తిరుపతయ్య, శేకేర్ గజానంద్, ఎరువుల మహేందర్, అత్థికారి మల్లేష్ తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
...
https://www.youtube.com/watch?v=0Aya_DNBopc