#bestteacher #teachers #mirudoddi
ప్రభుత్వ పాఠశాలలో విద్యాబోధన అనగానే ఉపాధ్యాయులు డుమ్మాలు కొడతారు.. సరైన బోధన చేయరు అంటూ విమర్శలు వినిపిస్తాయి. ప్రభుత్వ పాఠశాలలో మూడు సంవత్సరాలుగా ఒక్క సెలవు కూడా పెట్టకుండా విద్యార్థులకు మెరుగైన బోధన చేస్తూ శభాష్ అనిపించుకుంటున్నాడు ఓ ఉపాధ్యాయుడు..
సిద్దిపేట జిల్లా మెరుదొడ్డి మండలం కాసులాబాద్ ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పని చేస్తున్న కృష్ణమూర్తి అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నాడు. పాఠశాలకు ఎనిమిది గంటల 15 నిమిషాలకే వచ్చి విద్యార్థులకు బోధన చేయడంతో పాటు గత మూడు సంవత్సరాల నుండి ఒక సెలవు కూడా పెట్టకుండా అంకితభావంతో పని చేస్తూ విద్యార్థులతో పాటు గ్రామస్తుల మన్ననలు పొందుతున్నాడు. ఉపాధ్యాయుడు పనిచేస్తున్న తీరు తెలుసుకున్న ఎమ్మెల్యే రఘునందన్ రావు పాఠశాల ఆకస్మిక తనిఖీ వచ్చినప్పుడు ఉపాధ్యాయుడు కృష్ణమూర్తిని శాలువాతో సన్మానించారు. ఎమ్మెల్యే రఘునందన్ రావు సన్మానంతో మరింత బాధ్యత పెరిగిందని కృష్ణమూర్తి తెలిపాడు. సాధ్యమైనంత వరకు విద్యార్థులకు మెరుగైన బోధన అందించడమే లక్ష్యంగా వృత్తిలో కొనసాగుతానని వెల్లడించారు.
...
https://www.youtube.com/watch?v=ATK_VQ82qXs
సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలంలోని రామక్కపేట గ్రామంలో ఇటీవల మరణించిన గుంటి రాజు మరియు ముదిగొండ భాస్కర్ల కుటుంబాలను ముత్యం రెడ్డి కిసాన్ సేవ సమితి అధ్యక్షుడు,టిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు చెరుకు శ్రీనివాస్ రెడ్డి పరామర్శించి ఆర్థికసాయం అందజేశారు.
...
https://www.youtube.com/watch?v=wMIpr8Bn5CA