#venkateshwarakalyanam #laxmi #sdpt
సిద్దిపేట జిల్లా కేంద్రంలోని స్థానిక పారిపల్లి వీధిలో గల శ్రీ రమా వెంకట సత్యనారాయణ స్వామి దేవాలయంలో ఆలయ 12వ వార్షికోత్సవ బ్రహ్మోత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు ఆలయ కమిటీ సభ్యులు.కార్యక్రమాల్లో భాగంగా శనివారం శ్రీ రమా వీర వెంకట సత్యనారాయణ స్వామి కళ్యాణ మహోత్సవాన్ని
శ్రీశ్రీశ్రీ త్రిదండి రామచంద్ర రామానుజ జీయర్ స్వామి ప్రత్యక్ష పర్యవేక్షణలో ఘనంగా నిర్వహించారు.అనంతరం భక్తులకు అన్నప్రసాద వితరణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు.ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ అత్యంత మహిమాన్వితంగా వెలుగొందుతున్న శ్రీ రమా వీర వెంకట సత్యనారాయణ స్వామి ఆలయ వార్షికోత్సవాలు ఈ నెల 13వ తేదీ నుండి 17వ తేదీ వరకు కొనసాగుతున్నాయని అందులో భాగంగా శనివారం రమా వెంకట సత్యనారాయణ స్వామి కళ్యాణ మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించినట్టు తెలిపారు. కార్యక్రమాల్లో భాగంగా
ఆదివారం సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతాలు, స్వామివారి ఊరేగింపు ఉంటుందని 17న పూర్ణాహుతి కార్యక్రమంతో ఆలయ వార్షికోత్సవ కార్యక్రమాలు ముగుస్తాయని కావున భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రులు కావాలని కోరారు. అనంతరం భక్తులకు అన్నప్రసాద వితరణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు.
...
https://www.youtube.com/watch?v=tcDzGRU02BU
గురుకుల పాఠశాల లో విషాదం
చెరువు గట్టుపై చెప్పులు బట్టలు లభ్యం
ఆస్టల్ విద్యార్థిగా గుర్తించిన స్థానికులు
నవతెలంగాణ మిరుదొడ్డి
గురుకుల పాఠశాల విద్యార్థి హాస్టల్ నుండి గోడదూకి పారిపోయి చెరువులో పడ్డారని ఆరోపణ. మంగళవారం మిరుదొడ్డి మండలం అల్వాల సాంఘిక సంక్షేమ బాలుర గురుకుల పాఠశాలలో చోటు చేసుకుంది . హాస్టల్లో తొమ్మిదో తరగతి చదువుతున్న అలిగే కరుణాకర్ స్నేహితులతో కలిసి సమీపంలోని కుంటలో స్నానానికి వెళ్లారు. సరదాగా స్నానాలు చేస్తున్న సమయంలో కరుణాకర్ ఒక్కసారిగా జెసిబి గుంతలో మునిగిపోవడంతో స్నేహితులు కట్టెల సాయంతో కాపాడే ప్రయత్నం చేసిన ఫలితం లేకుండా పోయింది. కరుణాకర్ స్వగ్రామం నారాయణఖేడ్ మండలం గాడిదల హర్కేల్ తెలిపారు. విషయం బయటకు రావడంతో ఉపాధ్యాయులు పోలీసులకు సమాచారం అందించారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు గుంతలో పడిన కరుణాకర్ కోసం గాలింపు చర్యలు చేపట్టారు. కుంట సమీపంలో కర్ణాకర్ బట్టలు చెప్పులను పోలీసులు గుర్తించారు. రాత్రి సమయం కావడంతో కుంటలో కరుణాకర్ కోసం గాలింపు చేపట్టిన ఫలితం లేకుండా పోయింది.
...
https://www.youtube.com/watch?v=x5qNWOlZn0w
సిద్దిపేట జిల్లా దుబ్బాక మండల కేంద్రంలో ఆర్టీసీ బస్సు ప్రయాణికులకు పెను ప్రమాదం తప్పింది. దుబ్బాక నుండి సిద్దిపేటకు వెళ్తున్న సమయంలో రామసముద్రం చెరువు కట్ట కింద RTC మినీ బస్సు స్టీరింగ్ రాడ్డు విరిగిపోవడంతో బస్సు అదుపుతప్పి రోడ్డు కిందికి దూసుకు వెళ్ళింది. ప్రమాదం చోటు చేసుకున్న సమయంలో బస్సులో 20 మంది ప్రయాణికులు ఉన్నారు. డ్రైవర్ చాకచక్యంగా వ్యవహరించడంతో పెను ప్రమాదం తప్పిందని ప్రయాణికులు తెలిపారు. డ్రైవర్ అప్రమత్తంగా ఉండకుంటే ప్రాణం నష్టం జరిగే ప్రమాదం ఉండేదన్నారు. వెంటనే మరో వాహనం తెప్పించి ప్రయాణికులను ఆర్టీసీ అధికారులు గమ్యానికి చేర్చారు. బస్సు ప్రమాదంలో ఎవరికి ఏమి జరగకపోవడంతో ప్రయాణికులు, అధికారులు ఊపిరి పీల్చుకున్నారు.
...
https://www.youtube.com/watch?v=JUEi4CNJwBk